యాప్నగరం

వరద బాధితులకు శుభవార్త.. నేరుగా అకౌంట్లలోకి రూ. 10వేలు

గ్రేటర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం అందిస్తన్న వరద సాయంపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు చేసింది. నాయకులు నేరుగా వెళ్లి వరదసాయం అందించకూడదని పేర్కొంది.

Samayam Telugu 17 Nov 2020, 3:14 pm
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రేపట్నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో వరద సాయం పంపిణీ చేయాలా వద్దా అన్న సందిగ్ధం నెలకొంది. దీంతో వరద సాయంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసింది. జీహెచ్‌ఎంసీలో వరద సాయం పంపిణీ చేయాలా..? వద్దా..? అనేదానిపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. వరదసాయంపై కూడా కమిషనర్ మాట్లాడారు. ‘నిబంధనల మేరకు బాధితులకు వరద సహాయం చేయవచ్చు. డబ్బులు చేతికి కాకుండా బాధితుల బ్యాంకు అకౌంట్లలో మాత్రమే వేయాలి’ అని పార్థసారధి క్లారిటీ ఇచ్చారు.
Samayam Telugu అకౌంట్లలోకి వరద సాయం డబ్బులు
flood relief


Read More: Pawan Kalyan: జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో జనసేన.. ఒంటరి పోరుకు పవన్ సిద్ధం..?

ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అనేకమందికి ప్రభుత్వం ఆదుకునేందుకు వరదసాయం ప్రకటించింది. వరద బాధితులకు రూ. పదివేల సాయం అందిస్తోంది. ఇటీవలే దీనిపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వరద సాయం కోసం మీసేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలనుకున్నారు. దీంతో హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో వరద బాధితులు కొన్ని రోజులుగా మీ సేవా కేంద్రాల ముందు క్యూలు కడుతున్నారు. వరద సాయం అప్లై చేసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే లైన్ కడుతున్నారు. దీంతో గంటల తరబడి లైన్లో నిలబడలేక జనం అవస్థలు పడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.