Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రోలో దాదాపు రోజుకు నాలుగున్నర లక్షలకు పైగా ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సమ్మర్ సీజన్లో ప్రయాణికులు ఏసీ ప్రయాణాలకు మెుగ్గుచూపుతుండటంతో ఇటీవల రద్దీ పెరిగింది. అయితే ఏఫ్రిల్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో పలు ఆఫర్లను ఎత్తివేసింది. ఇంతకు ముందు క్యూఆర్ కోడ్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉండగా.. ఇప్పుడు డిస్కౌంట్ ఆఫర్ను ఎత్తేసింది. కేవలం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు రాత్రి 8 నుంచి అర్థరాత్రి వరకు మాత్రమే ఆ ఆఫర్ను వర్తింప జేస్తుంది. ఇక వీకెండ్ డేస్లో సూపర్ సేవర్ కార్డు ధర అంతకు ముందు రూ. 59 ఉండగా.. దాన్ని రూ.99కి పెంచింది. ఇదిలా ఉండగా.. మెట్రో ఛార్జీల పెంపు ఉంటుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెంపుపై ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు కేంద్రానికి నివేదికను పంపారు. అయితే మెట్రో ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ఛార్జీలను పెంచాలన్న ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో సంస్థ విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ఛార్జీల పెంపుపై ప్రభుత్వంపై అనేకసార్లు ఒత్తిడి వచ్చింది. కానీ ఎల్అండ్టీతో చేసుకున్న ఒప్పందం మేరకు ప్రస్తుతం ఉన్న కోచ్ల సంఖ్య పెంచకపోవడం పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు స్టేషన్లలో పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించడంలో కూడా ఎల్అండ్టీ విఫలమైనట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ రెండింటి విషయంలో ఎల్అండ్టీ ముందుకొచ్చే వరకు టిక్కెట్ రేట్లను పెంచే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు సమాచారం.
నష్టాల్లో ఉన్నందున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పంచాలని హైదరాబాద్ మెట్రో అధికారులు గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఛార్జీల పెంపుపై ప్రతిపాదనల తయారీకి గతేడాడి ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని (ఎఫ్ఎఫ్సీ) సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేట్ల పెంపుపై చర్చించి నివేదికను సమర్పించింది. ప్రస్తుతం మెట్రోలో కనీస టిక్కెట్ ధర రూ.10 ఉండగా.. గరిష్ఠంగా రూ.60 గా ఉంది. ఈ టికెట్ ధరలను సవరించి కనీస ధర రూ.15, గరిష్ఠంగా రూ.80 వరకు పెంచే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.
అయితే..మెట్రోలో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర సర్కారు అంతర్గతంగా సమీక్ష చేసింది. రద్దీ సమయంలో ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లను నడపడంలో మెట్రో అధికారులు ఫెయిల్ అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల అమీర్పేట్ మెట్రో స్టేషన్లో వందల మంది బారులు తీరారు. అదనంగా రైళ్లను నడపడానికి కోచ్లు లేకపోవడంతో మెట్రో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల పేరుతో ఎల్అండ్టీ అధికారులు కోచ్లను కొనుగోలు చేయకపోగా.. అనేక స్టేషన్లలో మౌలిక వసతులు కూడా లేవు. దీంతో సౌకర్యాలన్నింటిని కల్పించిన తరువాతే టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
నష్టాల్లో ఉన్నందున టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పంచాలని హైదరాబాద్ మెట్రో అధికారులు గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఛార్జీల పెంపుపై ప్రతిపాదనల తయారీకి గతేడాడి ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీని (ఎఫ్ఎఫ్సీ) సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేట్ల పెంపుపై చర్చించి నివేదికను సమర్పించింది. ప్రస్తుతం మెట్రోలో కనీస టిక్కెట్ ధర రూ.10 ఉండగా.. గరిష్ఠంగా రూ.60 గా ఉంది. ఈ టికెట్ ధరలను సవరించి కనీస ధర రూ.15, గరిష్ఠంగా రూ.80 వరకు పెంచే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.
అయితే..మెట్రోలో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర సర్కారు అంతర్గతంగా సమీక్ష చేసింది. రద్దీ సమయంలో ప్రయాణికులకు అనుగుణంగా రైళ్లను నడపడంలో మెట్రో అధికారులు ఫెయిల్ అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల అమీర్పేట్ మెట్రో స్టేషన్లో వందల మంది బారులు తీరారు. అదనంగా రైళ్లను నడపడానికి కోచ్లు లేకపోవడంతో మెట్రో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుల పేరుతో ఎల్అండ్టీ అధికారులు కోచ్లను కొనుగోలు చేయకపోగా.. అనేక స్టేషన్లలో మౌలిక వసతులు కూడా లేవు. దీంతో సౌకర్యాలన్నింటిని కల్పించిన తరువాతే టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
- Read More Telangana News And Telugu News