యాప్నగరం

పిచ్చికుక్కల దాడి ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం.. చలికాలంలో వేసే టీకాలు వేసుంటే!

Hyderabad నగరంలోని అమీర్‌పేటలో 50 మంది విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేసిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీచేసింది.

Samayam Telugu 22 Jan 2020, 9:07 pm
మీర్‌పేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పిచ్చి కుక్కలు దాడి చేసిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు నమోదైంది. జీహెచ్‌ఎంసీ, వెటర్నరీ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత రావు పిటిషన్ దాఖలు చేశారు. చలికాలంలో వీధి కుక్కలకు ఇవ్వాల్సిన టీకాలు ఇవ్వకపోవడం వల్లే అవి వీధుల్లో స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.
Samayam Telugu dog bite


అమీర్‌పేట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను అచ్యుత రావు కోరారు. బాధిత విద్యార్థులకు వైద్య ఖర్చులు ప్రభుత్వం చెల్లించేవిధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని డిమాండ్ చేశారు.

Must Read: తొలిసారిగా వచ్చా, కానీ నా ఓటు చెల్లుతుందా.. యువతి ఆవేదన

ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం స్పందించింది. ఘటనపై ఫిబ్రవరి మొదటి వారంలోగా సమాధానం ఇవ్వాలని జీ‌హెచ్‌ఎంసీ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేదరకు బుధవారం (జనవరి 22) సాయంత్రం నోటీసులు జారీ చేసింది.

వీధికుక్కలు దాడి చేసిన ఘటనలో అమీర్‌పేటలోని ధరంకరమ్ రోడ్డులో 50 మంది విద్యార్థులు గాయపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం పాఠశాలలో తరగతులు ముగిసిన అనంతరం ఇళ్లకు బయల్దేరిన విద్యార్థులపై పిచ్చికుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు. వీధికుక్కలపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: టీఆర్‌ఎస్ అభ్యర్థి ముక్కు కొరికేసిన కాంగ్రెస్ అభ్యర్థి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.