యాప్నగరం

హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద విద్యార్థుల ఆందోళన.. పోలీసుల లాఠీ ఛార్జ్

విద్యార్థి సంఘాలు పరీక్షల నిర్వహణపై ఆందోళనకు దిగాయి. దీంతో కరోనా టైంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పరీక్షలు లేకుండా విద్యార్థుల్ని పాస్ చేయాలని డిమాండ్ చేశారు.

Samayam Telugu 5 Oct 2020, 1:23 pm
హైదరాబాద్ కూకట్‌పల్లి JNTU వద్ద విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. కోవిడ్ పరిస్థితులలో పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. కోవిడ్ పరిస్థితులలో పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశాయి. అదే విధంగా 50 % ఫీజు మాఫీ చేయాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జెఎన్టియు ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. బీటెక్ మొదటి రెండవ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు అనుమతించాలని ధర్నా నిర్వహించారు.
Samayam Telugu జేఎన్టీయూ వద్ద ఆందోళన
jntu protest in hyderabad


Read More: కిషన్ రెడ్డి కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతల హడావుడి

పోలీసులు ఎంత నచ్చచెప్పినా శృతిమించడంతో పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు . ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య గొడవ జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు . పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయాలని అదేవిధంగా 50 % ఫీజు మాఫీ చేయాలని ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో జెఎన్టియు ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు. బీటెక్ మొదటి రెండవ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా పై తరగతులకు అనుమతించాలని కోరారు.

అయితే ... పోలీసులు ఎంత నచ్చచెప్పినా విద్యార్థి సంఘాలు తమ ఆందోళనల్ని విరమించకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పలువురు విద్యార్థుల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు . ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య గొడవ జరగడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. స్వల్ప లాఠీ ఛార్జ్ చేసి విద్యార్థుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.