యాప్నగరం

విషాదం.. ర్యాంకు రాలేదని విద్యార్థి ఆత్మహత్య

ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు విద్యార్థి చెప్పులు బావి వద్ద గుర్తించారు. దీంతో బావిలో బిడ్డ కోసం గాలించారు.

Samayam Telugu 7 Oct 2020, 2:09 pm
ర్యాంకు కోసం ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. ఎంసెట్ ఫలితాల్లో తనకు ర్యాంకు రాలేదని మనస్తాపం చెంది వల్ల వెంకటేశ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కళశాలలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి... ఎంసెట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే మంగళవారం వెలువడిన ఫలితాల్లో ర్యాంకు రాకపోవడం వల్ల మనస్తాపం చెంది ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎంతసేపయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
Samayam Telugu విద్యార్థి ఆత్మహత్య
student suicide


Read More : ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. కండక్టర్ దుర్మరణం

వెంకటేష్ చల్గల్ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిసింది. విద్యార్ధి ఇంటికి రాకపోవడం వల్ల అతని కోసం కుటుంబ సభ్యులు వెతకగా... బావి వద్ద చెప్పులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బావిలో నీటిని తోడి వెతకగా విగత జీవిగా పడి ఉన్న వెంకటేష్ మృత దేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ర్యాంకు కోసం కలత చెంది తమ బిడ్డ ప్రాణాలు తీసుకున్నాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సెప్టెంబర్‌లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు అక్టోబర్ 6,2020 విడుదల అయ్యాయి. JNTUలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్‌లో 75.29 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. లక్షా 19వేల 183 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.89వేల 734 మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.