యాప్నగరం

నేరేడ్‌మెట్ బాలిక మృతి: GHMC అధికారులపై కేసు పెట్టిన తల్లిదండ్రులు

GHMC: నాలాలో పడి చనిపోయిన బాలిక పేరెంట్స్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. శనివారమే బాలికకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాలాల మీద కనీసం జాలీలైనా ఏర్పాటు చేసి ఉంటే తమ కుమార్తె బతికి ఉండేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు.

Samayam Telugu 19 Sep 2020, 5:37 pm
చిన్నారి సుమేధ (12) మరణానికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు అభిజిత్‌, సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరేడ్‌మెట్‌కు చెందిన బాలిక బయటికి వెళ్లి రోడ్డుపై నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో సంబంధిత మున్సిపల్‌ ఇంజినీర్లు ఏఈ, డీఈలపై కేసు నమోదు చేస్తామని నేరేడ్‌మెట్ పోలీసులు చెప్పారు.
Samayam Telugu బాలిక సుమేధ
Sumedha parents complaint against ghmc official over his daughter death


నాలాలో పడి చనిపోయిన బాలిక పేరెంట్స్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. శనివారమే బాలికకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. నాలాల మీద కనీసం జాలీలైనా ఏర్పాటు చేసి ఉంటే తమ కుమార్తె బతికి ఉండేదని తల్లిదండ్రులు ఆవేదన చెందారు. 14 ఏళ్లుగా ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని.. తాము వచ్చినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉందో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.

హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో రెండ్రోజుల క్రితం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన బాలిక సుమేధ బండ చెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నానని చెప్పిన పాప ఇంటికి రాలేదు. స్థానికులను ఆరా తీసినప్పటికీ చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఓ నాలా దగ్గర సుమేధ సైకిల్ కనిపించడంతో నాలాలో పడిపోయిందేమో అని అనుమానించారు. ఆ దిశగా సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా బండ చెరువులో బాలిక మృతదేహాం దొరికింది.

Must Read: మరికొద్ది గంటల్లో అతి భారీవర్షం.. మరో మూడ్రోజులు ఈ జిల్లాల్లో కుండపోతే..Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.