దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్కౌంటర్పై దాఖలైన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది.. ఈ సందర్భంలో విచారణ కమిషన్కు కొన్ని విధివిధానాలను ప్రస్తావించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఎందుకు జరిగింది.. ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు ఏంటో పరిశీలించాలని ఆదేశించింది. అంతేకాదు తప్పు జరిగి ఉంటే అధికారుల్ని బాధ్యుల్ని చేయాలని చెప్పింది.
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనేది సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా ఎన్కౌంటర్ వ్యవహారంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సిట్టింగ్ కమిషన్ ఛైర్మన్కు రూ.1.50 లక్షలు.. మిగిలిన ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున చెల్లించడంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎన్కౌంటర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. అలాగే కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్పీ సొండూర్బల్డోటా, సీబీఐ వతూజీ డైరెక్టర్ కార్తికేయన్లు సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు చేసి ఆరు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనేది సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రధానంగా ఎన్కౌంటర్ వ్యవహారంలో ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగిందా అని కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సిట్టింగ్ కమిషన్ ఛైర్మన్కు రూ.1.50 లక్షలు.. మిగిలిన ఇద్దరు సభ్యులకు రూ.లక్ష చొప్పున చెల్లించడంతోపాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.
ఎన్కౌంటర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. అలాగే కమిషన్లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్పీ సొండూర్బల్డోటా, సీబీఐ వతూజీ డైరెక్టర్ కార్తికేయన్లు సభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్కౌంటర్పై సమగ్ర దర్యాప్తు చేసి ఆరు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.