యాప్నగరం

కరోనాపై పోరులో సుప్రీంకోర్టు జడ్జి సాయం.. తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా

Coronavirus Cases in India: తెలంగాణ, ఏపీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 59 కేసులు నమోదు కాగా, ఏపీలో 13 కేసులు కరోనా అని నిర్ధారణ అయింది.

Samayam Telugu 28 Mar 2020, 4:16 pm
వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా విరాళం ప్రకటించారు. తెలుగు వారైన జస్టిస్ ఎన్వీ రమణ తనవంతు సాయంగా ఈ విరాళం ప్రకటించడం విశేషం. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలకు విరాళం ప్రకటించిన తొలి న్యాయమూర్తి ఈయనే. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరి ఒక రూ.లక్ష చొప్పున ప్రకటించారు. మరోవైపు, ప్రధానమంత్రి సహాయ నిధికి కూడా రూ.లక్ష విరాళంగా అందిస్తున్నట్లు ఆయన శనివారం ప్రకటించారు. కరోనా వైరస్‌తో పోరాడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న చర్యలకు అందరూ మద్దతుగా నిలబడాలని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. అలాగే కోవిడ్ -19 వ్యాప్తిచెందకుండా ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఎన్వీ రమణ ప్రజలకు సూచించారు. మరోవైపు కరోనాను ఎదుర్కోడానికి విరాళం ప్రకటించిన న్యాయమూర్తుల్లో ప్రథములు.
Samayam Telugu NV Ramana


Also Read: పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా: ఈటల

మరోవైపు, తెలంగాణ, ఏపీల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే 59 కేసులు నమోదు కాగా, ఏపీలో 13 కేసులు కరోనా అని నిర్ధారణ అయింది. ప్రస్తుతం కరోనా రెండో దశలో ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా సోకినవారు మొత్తం 873 మంది ఉన్నారు. కోలుకున్నవారు 79 మంది కాగా, చనిపోయిన వారు 19 మంది ఉన్నారు.

Also Read: చుక్క లేక మందుబాబుల నరకయాతన.. ఒకరు మృతి, పలు చోట్ల ఘోరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.