యాప్నగరం

హుజురాబాద్‌లో గెలిచేది ఈటల మాత్రమే.. సర్వేలు వెల్లడి: బండి సంజయ్‌

Telangana BJP: క్విట్ ఇండియా దినోత్సవం రోజు భాగ్యలక్ష్మి గుడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు.

Samayam Telugu 14 Jul 2021, 10:14 pm
కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసింది. అనంతరం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీలో చేరిన రోజే అమిత్‌షాను కలవాలనుకున్నామని బండి సంజయ్ తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ ఆ ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయని వెల్లడించారు.
Samayam Telugu బండి సంజయ్ (ఫైల్ ఫోటో)
bandi sanjay


క్విట్ ఇండియా దినోత్సవం రోజు భాగ్యలక్ష్మి గుడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని బండి సంజయ్ ప్రకటించారు. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా వస్తానని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆగస్టు 9న తన పాదయాత్ర మొదలవుతుందని అన్నారు. తమ ప్రభ చూసి టీఆర్‌ఎస్‌ భయపడుతోందని, వారికి అభ్యర్థి దొరకడమే లేదని సంజయ్‌ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని బీజేపీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని చెప్పారు. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తానని అన్నారని తెలిపారు. ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీనేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.