యాప్నగరం

పెళ్లైన ఐదు నెలలకే వధువు అనుమానాస్పద మృతి.. కారణం అదేనా..?

Rajendranagar: పెళ్లి జరిగి ఆరు నెలలు కూడ గడవక ముందే.. ఆమెకు నూరేళ్లు నిండాయి. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవవధువుకు భర్త నుంచి అడుగడుగునా.. వేధింపులే ఎదురయ్యాయి. కలలో కూడా ఊహించని ఆ కలతలు.. మొదట్లోనే రావటంతో కుంగిపోయిన ఆమె విగతజీవిగా మారింది. అయితే.. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా.. అన్నది అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 28 Sep 2022, 12:15 pm
Rajendranagar: మూడు ముళ్లు పడి కనీసం ఆర్నెళ్లు కూడా కాలేదు. అప్పుడే నిండు జీవితానికి ఓ నవవధువు స్వస్తి పలికేసింది. ఈ విషాదకర ఘటన.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో జరిగింది. వివాహం జరిగిన ఐదు నెలలకే ఒక నవవధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఆమె మృతి విషయం తెలిసి వధువు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే.. వధువు మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు విషయమేమిటంటే.. శీనుకు రేణుకతో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహమైన కొద్దిరోజుల వరకు అంతా బాగానే ఉంది. కొన్ని రోజుకు రేణుకకు వేరే వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే కొత్తగా పెళ్లైన ఆ జంట మధ్య చిచ్చు మొదలైంది. ఈ విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. అంతే కాకుండా.. రేణుకను శ్రీను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు.
Samayam Telugu Newly married bride.
నవవధువు ఆత్మహత్య


ఎన్నో ఆశలతో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన తనకు.. భర్త నుంచి మొదట్లోనే ఊహించని వేధింపులు ఎదురయ్యేసరికి రేణుక కుంగిపోయింది. కట్ చేస్తే.. ఇంట్లో ఫ్యాన్‌కు విగతజీవిగా రేణమ్మ వేలాడుతూ కనిపించింది. రేణమ్మను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పథకం ప్రకారమే రేణుకను శీను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడంటూ.. వధువు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు కూడా పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. రేణుకది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రేణుక భర్త శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం రేణుక మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. శ్రీనుపై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రేణుక కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు.

మరోవైపు.. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లిలోనూ విషాదం చోటుచేసుకుంది. పెళ్లయి ఆరు నెలలు కూడా నిండకుండానే నవ దంపతులకు నూరేళ్లు నిండాయి. చూడముచ్చటగా ఉన్న ఆ జంటపై ఏ కన్ను కుట్టిందో.. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ కలహాలతో విరక్తి చెందిన భార్యభర్తలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం లక్ష్మణ్, నిఖిత దంపతులు.. వాళ్లు నడిపిస్తోన్న దుకాణంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో.. అటుగా వచ్చిన తండావాసి అది చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పెళ్లయిన ఆరు నెలలకే ఇలా జరగడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.
రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.