యాప్నగరం

జనరల్ వార్డులో స్వైన్ ఫ్లూ రోగి.. గాంధీ సిబ్బంది నిర్వాకం!

Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. స్వైన్ ఫ్లూ రోగికి సాధారణ పేషంట్ల మధ్యలో పడకను కేటాయించడం వివాదాస్పదమవుతోంది.

Samayam Telugu 19 Feb 2020, 11:31 am
తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు నమోదయ్యాయి. గాంధీ, ఉస్మానియా, చెస్ట్ ఆస్పత్రుల్లో స్వైన్ ఫ్లూ లక్షణాలతో రోగులు చికిత్స పొందుతున్నారు. అంతేకాక కరోనా వైరస్ అనుమానితుల్లో కొంత మందికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక, వరంగల్ జిల్లాకు చెందిన ఓ గర్భిణీ స్వైన్ ఫ్లూతో మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో చేరింది. అయితే, అనుమానిత స్వైన్ ఫ్లూ రోగులకు జనరల్ వార్డులోనే చికిత్స అందిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Samayam Telugu gandhi hospital


దీంతో గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నిర్వాకం మరోసారి బయట పడింది. స్వైన్ ఫ్లూ రోగికి సాధారణ పేషంట్ల మధ్యలో పడకను కేటాయించడం వివాదాస్పదమవుతోంది. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మాస్కులు కూడా అందుబాటులో ఉంచడం లేదని.. అర్థరాత్రి నుంచి వైద్యులు, నర్సులు కూడా అందుబాటులో లేరని చెబుతున్నారు.

Also Read: అలా అయితే మేం జాతీయ పార్టీ పెడతాం.. కేటీఆర్, పీయుశ్ గోయల్ మధ్య సరదా చర్చ

Must Read: రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో


ఈ విషయం వివాదాస్పదం కావడంతో ప్రస్తుతం గర్భిణీని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం గాంధీలో ఐదుగురు స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Must Read: శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన.. సభలో తలసానికి రైల్వే మంత్రి గట్టి కౌంటర్

Also Read: విద్యార్థిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి చావబాదిన దంపతులు.. సనత్‌నగర్‌‌లో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.