యాప్నగరం

అలా చేయలేకపోతే ఇంట్లో కూర్చోండి: విపక్షాలపై మంత్రి తలసాని ఫైర్

కరోనా సమయంలో విపక్షాలు ప్రజలకు చేతనైనంత సాయం చేయకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

Samayam Telugu 17 May 2021, 2:43 pm

ప్రధానాంశాలు:

  • విపక్ష నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం
  • ప్రజలకు చేతనైనంత సాయం చేయాలని విపక్షాలకు సూచన
  • అలా చేయకపోతే ఇంట్లో కూర్చోవాలని సెటైర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu తలసాని శ్రీనివాస్ యాదవ్
కరోనా విషయంలో ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి విపత్కర సమయంలో చేతనైతే సాయం చేయాలని, లేకపోతే ఇంట్లో కూర్చోవాలని సలహా ఇచ్చారు. కరోనా కట్టడిపై జీహెచ్ఎంసీలో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే జరుగుతోందని, ఇప్పటివరకు 9లక్షల మందికి పరీక్షలు చేశామని తెలిపారు.
స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టేవారు ప్రభుత్వం ఇచ్చిన గడువు సమయంలోనే నిర్వహించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. కరోనా రోగులతో పాటు వచ్చేవారికి ఇబ్బంది కలగకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద అన్నపూర్ణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌‌లు ఆపే విషయాన్ని కొందరు దురుద్దేశంతో రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. హైదరాబాద్‌లో బెడ్స్ ఖాళీ లేవన్న కారణంతోనే అంబులెన్స్‌ను ఆపాల్సి వచ్చిందని, బెడ్స్‌ ఖాళీ ఉంటే ఎవరైనా సిటీకి వచ్చి ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చని పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.