యాప్నగరం

తెలంగాణలో షర్మిల పార్టీ! వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఒంట్లో ప్రవహిస్తుంది కూడా వైఎస్ రక్తమే అన్నారు. జగన్ షర్మిల విషయంలో అన్యాయం చేశారన్నాడు. అందుకే ఆమె పార్టీ పెట్టే ఆలోచన చేస్తుందన్నారు వీహెచ్.

Samayam Telugu 24 Jan 2021, 8:12 pm
జగన్ తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కూడా పెడుతున్నారా? షర్మిలను సీఎం అభ్యర్థిగా నిలబెడుతున్నారా? ో ప్రముఖ మీడియాలో వచ్చిన కథనాలపై ఇప్పుడు తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడన్నారు వీహెచ్.
Samayam Telugu వైఎస్ షర్మిల
sharmila party in Telangana


షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా జగన్ అన్యాయం చేశాడని ఆరోపించారు. షర్మిల ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే ఏపీలోనే కొత్త పార్టీ పెట్టడం మేలన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వీహెచ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయని, ఏపీలో అయితే జగన్ వ్యతిరేకులు షర్మిల వెంట వస్తారని చెప్పారు. జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలోనే పార్టీ పెట్టుకోవాలని వీహెచ్ సూచించారు.

Read More: తెలంగాణలో జగన్ పార్టీ.. సీఎం అభ్యర్థిగా షర్మిల ?

ఇప్పటికే టీడీపీ నేత పట్టాభి కూడా షర్మిల పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తమనకు సమాచారం ఉందన్నారు. టీ కాంగ్రెస్ నేత వీహెచ్ షర్మిల పార్టీపై స్పందించడంతో ఈ టాపిక్‌ మారింత హాట్‌గా మారింది. అయితే ఈ విషయంపై ఇంకా తెలంగాణ నాయకులు ఎంతమంది స్పందిస్తారో వేచి చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.