యాప్నగరం

కోటి దీపోత్సవంలో.. చంద్రబాబు చెవిలో పూరీ పీఠాధిపతి ఏం చెప్పారు?

Koti Deepotsavam వేడుకలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పూరీ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి స్వామి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా స్వామి.. బాబు చెవిలో ఏదో రహస్యంగా చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది.

Samayam Telugu 17 Nov 2019, 10:51 pm
హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ వేడుకల్లో 15వ రోజు పూరీ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి స్వామి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయానికి ప్రతీకలుగా నిలుస్తోన్న ఆడపడుచులపై ఆయన ప్రశంసలు గుప్పించారు. కార్తీక మాసం అనగానే వనభోజనాలు, కోటి దీపారాధన గుర్తొస్తాయన్నారు. నరేంద్ర చౌదరి 8 ఏళ్ల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారంటూ ప్రశంసలు గుప్పించారు. భక్తిభావంతోనే గంటల తరబడి ప్రజలు ఇక్కడ ఉండగల్గుతున్నారన్నారు.
Samayam Telugu tdp chief chandrababu naidu takes blessings of puri peetadhipathi at koti deepotsavam
కోటి దీపోత్సవంలో.. చంద్రబాబు చెవిలో పూరీ పీఠాధిపతి ఏం చెప్పారు?


అన్నవరం సత్యనారాయణ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. వ్రతం చేయడం ఆనందాన్ని కలిగించిందన్నారు. స్వామీజీల ఆశీస్సులు, దీవెనలు పొందడం శుభపరిణామం అన్నారు.

నా చిన్నతనంలో గ్రామంలో కార్తీక మాసంలో పవిత్ర భావనతో వేకువజామునే నిద్రలేచి దీపాలు వెలిగించేవారంటూ.. చంద్రబాబు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. దేవాలయాల సందర్శన వల్ల మనో నిబ్బరత పెరుగుతుందన్నారు. దేవుడి సన్నిధిలో ధ్యానం చేస్తే చాలా సమస్యలు తొలగిపోతాయన్నారు.

చంద్రబాబు మాట్లాడిన తర్వాత వేదికపైనే ఉన్న పూరీ పీఠాధిపతి ఆయన్ను పిలిచి చెవిలో ఏదో చెప్పారు. బహుశా ఆయన రహస్యంగా బాబు చెవిలో ఏదైనా మంత్రోపదేశం చేసి ఉంటారని భక్తులు భావిస్తున్నారు.

Read Also: వైఎస్ విజయమ్మ ట్రస్ట్‌పై కేంద్రం నిషేధం..

ఎవరీ నిశ్చలానంద?
శంకరాచార్యుడు భారతదేశంలో శృంగేరి, పూరీ, బదరి, ద్వారాకా పీఠాలను స్థాపించిన సంగతి తెలిసిందే. పూరీలోని గోవర్థన పీఠానికి 145వ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి స్వామి. ఆయన బిహార్‌లోని మధుబనిలో జన్మించారు. బాల్యం నుంచే వేదాల పట్ల పాండిత్యాన్ని సంపాదించారు. 1974లో సన్యాస ధర్మాన్ని స్వీకరించారు. 1995 నుంచి గోవర్థన పీఠాధిపతిగా కొనసాగుతున్నారు.

పూరీ శంకరాచార్య శ్రీ నిశ్చలానంద స్వామి తొలి పూజలు చేసిన చేసిన తర్వాతే జగన్నాథుని రథయాత్ర ప్రారంభం అవుతుంది. దీన్ని బట్టే పూరీ పీఠం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయనకు వేదగణితం పట్ల మంచి పట్టుంది. చంద్రయాన్-2 ప్రయోగానికి ముందు ఇస్రో శాస్త్రవేత్తలు స్వామీజీ సలహాలు, సూచనలు తీసుకున్నారు.

Read Also: ‘జగన్‌ బెయిల్ రద్దు చేయనున్న సీబీఐ?’

కోటిదీపోత్సవ విశేషాలు..
ఆదివారం కోటిదీపోత్సవ వేదికపై అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కళ్యాణం నిర్వహించారు. అనంతరం స్వామివారిని శేషవాహనంపై ఊరేగించారు. శ్రీ నిశ్చలానంద సరస్వతి, పూరీ శంకరాచార్య స్వామివార్ల ఆశీర్వాదం అందజేయగా.. శ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనామృతం భక్తులను విశేషంగా ఆకట్టుకునున్నాయి.

Read Also: జగన్ ప్రస్తావన.. విజయసాయిరెడ్డికి అమిత్ షా క్లాస్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.