యాప్నగరం

టీపీసీసీ రేస్: రేవంత్ రెడ్డిని కలిసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ల్కాజ్‌గిరిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వచ్చేనెల జరగనున్న కూతురు వివాహానికి సంబంధించిన శుభలేఖ అందించారు.

Samayam Telugu 27 Dec 2020, 1:46 pm
తెలంగాణలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ పదవి హాట్ టాపిక్‌గా మారింది. ఈ పోస్టు రేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. టీపీసీసీ చీఫ్ పదవికి ఎంపీ రేవంత్ రెడ్డి సరైన వ్యక్తి అనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమచాారం. దీంతో పలువురు సీనియర్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. పీసీసీ చీఫ్ నియామకంలో తొందర వద్దని వారిస్తున్నారు. అయితే ఈ సమయంలో పలువురు నాయకులు ముందుగానే రేవంత్‌ను కలిసి అడ్వాన్స్‌గా అభినందనలు తెలుపుతున్నారు.
Samayam Telugu రేవంత్ రెడ్డి
revanth reddy


ఈ నేపథ్యంలో ఎంపీ రేవంత్ రెడ్డిని కలిశారు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మల్కాజ్‌గిరిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహానికి రావాల్సిందిగా చింతమనేని ఆహ్వానించారు. వివాహ శుభలేఖను రేవంత్‌ రెడ్డికి అందజేశారు. ప్రస్తుతం చింతమనేని హైదరాబాద్‌లో ఉన్నారు.తన అనుచరులు, పార్టీ నేతలతో కలిసి మల్కాజ్‌గిరిలోని రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అనంతరం ఆయనకు వివాహ శుభలేఖను అందజేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముందున్న రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా చింతమనేని అభినందించినట్లు చెబుతున్నారు.

Read More: నాగార్జున సాగర్ ఉప ఎన్నిక.. అన్నిపార్టీలకు కీలక సూచన చేసిన గుత్తా

చింతమనేని పెద్ద కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహం వచ్చేనెల 2వ తేదీన జరుగనుంది. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఈ పెళ్లికి బంధుమిత్రులను ఆహ్వానించారు. ఇదివరకే చింతమనేని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ను కలిశారు. వివాహ శుభలేఖను అందజేశారు. రేవంత్‌తో చింతమనేని భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.