యాప్నగరం

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో మిస్టేక్.. భార్య శాశ్వతంగా దూరం

Sindhuja Reddy Death: జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు రోజుల కిందట కారుతో పాటు కొట్టుకోపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సింధూజ రెడ్డి విగతజీవిగా తేలింది. కర్నూలు సమీపంలో తుంగభద్రా నదిలో ఆమె మృతదేహం బయటపడింది.

Samayam Telugu 29 Jul 2020, 4:59 pm
పోలీస్ తనిఖీల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తి తన భార్యను కోల్పోయిన విషాదమిది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్ల వాగులో రెండు రోజుల కిందట గల్లంతైన సింధుజా రెడ్డి.. కర్నూలు పట్టణం సమీపంలో తుంగభద్రా నదిలో విగతజీవిగా తేలింది. గద్వాల జిల్లా పుల్లూరు, కలుగొట్ల మధ్యనున్న వాగులో జులై 25న ఆమె కారుతో సహా కొట్టుకుపోయింది. హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరవడానికి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. రెండు రోజులుగా అధికార యంత్రాంగం ఆమె ఆచూకీ కోసి గాలిస్తున్నారు.
Samayam Telugu వాగులో గల్లంతై సింధూజ దుర్మరణం
Techi Found Dead in Gadwal Car Accident


కడప జిల్లాకు చెందిన శివశంకర్‌ రెడ్డి, సింధూజ రెడ్డికి ఏడాది కిందట వివాహమైంది. ఈ దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. శివశంకర్‌ రెడ్డి సోదరి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తరచూ ఆయన ఇక్కడికి వచ్చి పోతుండేవారు. సోదరి నూతన గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు శివశంకర్ రెడ్డి తన భార్యతో పాటు స్నేహితుడు జిలానీ బాషాతో కలిసి శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వీరు కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. తుంగభద్ర నది పక్కన ఉండే పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలు ఉంటాయని భావించిన శివశంకర్ రెడ్డి.. వారిని తప్పించుకోవడానికి వాహనాన్ని పుల్లూరు, కలుగొట్ల వైపు మళ్లించారు. ఆ సమయంలో కలుగొట్ల వాగుపై ఉన్న కాజ్‌వేపై వర్షపు నీరు భారీగా వెళ్తోంది. వరద ఉధృతిని గమనించకుండా కారును అలాగే ముందుకుపోనిచ్చాడు. కాజ్‌వే దాటుతుండగా కారు నీటిలో ఆగిపోయింది.

వరద ప్రవాహంలో ఆగిపోయిన కారులోంచి శివశంకర్‌ రెడ్డి, జిలానీ బాషా కిందకు దిగారు. సింధూజను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా కారుతో సహా ఆమె వరదలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. శనివారం కారును వెలికి తీశారు. సోమవారం మధ్యాహ్నం సింధూజ మృతదేహాన్ని వెలికితీశారు.

Woman Body Found in Tungabhadra River


కలుగొట్ల నుంచి సుమారు 600 మీటర్ల దూరంలో తుంగభద్ర నది ఉంది. వాగులో పడిపోయిన సింధూజ వరద ప్రవాహానికి కొట్టుకుపోయి చివరికి నదిలో విగతజీవిగా తేలింది. ప్రస్తుతం తుంగభద్రకు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో ఆమె ఆచూకీ దొరకడం కష్టమేనని భావించారు. కళ్ల ముందే నీటిలో కొట్టుకుపోయిన తన భార్య విగతజీవిగా తేలడంతో శివశంకర్ రెడ్డి కన్నీరుమున్నీరవుతున్నాడు. జరిమానా వేస్తే కాస్త టైమ్ తీసుకొని అయినా కట్టొచ్చు.. కానీ, ప్రాణాలు పోతే తిరిగిరావు. ఇలాంటి మిస్టేక్ ఎవరూ చేయొద్దు.

Don't Miss: ముస్లిమే.. కానీ, రాముడంటే ప్రాణం, మందిరం నిర్మాణానికి మట్టితో బయల్దేరాడు

Also Read: కరోనా సెంటర్‌లో అమ్మాయిపై రోగి లైంగిక దాడి.. అర్ధరాత్రి టాయిలెట్ వద్ద మాటేసి!

Watch: కూల్చివేత తర్వాత సచివాలయం ఇలా.. ఆంక్షల మధ్య మీడియా కవరేజీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.