యాప్నగరం

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈటలకు తప్పిన ప్రమాదం

విమానంలో ఈటల రాజేందర్‌తో పాటు దుబ్బాక ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వివేక్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. వీరంతా ప్రయాణిస్తున్న ఫ్లైట్ గాల్లోకి లేవగానే సాంకేతిక సమస్య తలెత్తింది.

Samayam Telugu 15 Jun 2021, 10:11 am
ఢిల్లీ నుంచి వస్తున్నమాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఈటల వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. వెంటనే పైలట అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
Samayam Telugu ఈటలకు తప్పిన ప్రమాదం

విమానం టేకాఫ్ అయ్యేప్ సమయంలో రన్ వే పై సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అది గుర్తించిన పైలెట్.... అప్రమత్తం అయ్యాడు. గాల్లోకి లేచే టైంలో అలెర్ట్ అయి సంకేతిక సమస్యను ఫైలెట్ గుర్తించాడు.

దీంతో ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఈటెల రాజేంద్ర బృదం. బయలుదేరింది.
మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి,తుల ఉమాతో పాటు విమానంలో మొత్తం 184 మంది ఉన్నారు. మరోవైపుఈరోజు హైదరాబాద్ చేరుకున్న తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి మొదటసారి ఈటల రాజేందర్ వెళ్లనున్నారు. ముఖ్యనేతలతో మాజీమంత్రి ఈటల సమావేశంకానున్నారు. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మంద్ర ప్రధాన్ సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.