యాప్నగరం

పురపాలక ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రిటీలు :గవర్నర్ తమిళిసై

Taramati Baradari: తెలంగాణ ఎన్నికల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా గొప్పదని గవర్నర్‌ కొనియాడారు.

Samayam Telugu 11 Jan 2020, 2:01 pm
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై గవర్నర్‌ తమిళిసై ప్రశంసలు కురిపించారు. నగరంలోని తారామతి బారాదరిలో తెలంగాణ రాష్ట్ర డెమొక్రసీ అవార్డుల బహూకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై మాట్లాడుతూ.. ఎన్నికల విధుల నిర్వహణ సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల్లో పోలింగ్‌ శాతం ఎక్కువగా నమోదవుతోందని.. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సమర్థవంతంగా నిర్వహించిందని అభినందించారు.
Samayam Telugu tamilisai_soundararajan


ఇందుకుగాను తెలంగాణ ఎన్నికల సంఘాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా గొప్పదని గవర్నర్‌ కొనియాడారు. స్థానిక సంస్థల్లో ప్రజలే సెలబ్రిటీలని గవర్నర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలు రాష్ర్టాల ఎన్నికల సంఘం అధికారులు పాల్గొన్నారు.

శుక్రవారం మరో కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్.. మన తాత ముత్తాతలు అనుసరించిన ఆహార అలవాట్లనే మనమూ అనుసరించాలని గవర్నర్ సూచించారు. వారు తాజాగా వండిన ఆహార పదార్థాలనే సేవించేవారని, స్థానికంగా లభ్యమయ్యే పదార్థాలతోనే వండేవారని చెప్పారు. వేళకు భోజనం చేయడం వంటి విధానాల వల్ల వారికి పోషకాహార సమస్యలేవీ లేవని మనమూ అలాంటి అలవాట్లనే అలవర్చుకోవాలని సూచించారు. పట్టణాల్లో హడావుడి పనుల వల్ల ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేస్తున్నారని గవర్నర్ గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.