యాప్నగరం

రైతుకు కేసీఆర్ అరుదైన పిలుపు.. రేపు ప్రగతి భవన్‌లో..

Komaram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు బాలాజీ ఆపిల్ తోటను సాగు చేశారు. ఈ పంట ఇటీవలే చేతికొచ్చింది. ఈ రైతుకు కేసీఆర్ నుంచి ఆహ్వానం లభించింది.

Samayam Telugu 26 May 2020, 5:30 pm
తెలంగాణలో పండించిన యాపిల్ పండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ రుచిచూడనున్నారు. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బాలాజీ అనే రైతు యాపిల్ పంటను పండించిన సంగతి తెలిసిందే. వినూత్నంగా తెలంగాణలో ఆ పంట పండించిన రైతుకు కేసీఆర్ నుంచి అరుదైన పిలుపు వచ్చింది. ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు బాలాజీ ఆపిల్ తోటను సాగు చేసిన సంగతి తెలిసిందే. ఆరేళ్లపాటు ఆయన శ్రమించగా.. ఈసారి యాపిల్ పండ్ల దిగుబడి బాగా వచ్చింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని సీఎం ఆశ్చర్యపోయారు. ఆ రైతును తనవద్దకు తీసుకురావాలని కొద్ది రోజుల క్రితం సీఎం అధికారులను ఆదేశించారు.
Samayam Telugu కేసీఆర్ (ఫైల్ ఫోటో)
kcr


అయితే, కొన్నాళ్లుగా సీఎం బిజీగా ఉండడంతో ఎట్టకేలకు అపాయింట్‌మెంట్ ఖరారైంది. ముఖ్యమంత్రి వద్దకు రావాలని రైతు బాలాజీకి అధికారులు సమాచారం ఇచ్చారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన రైతు త్వరలోనే తన తోటలోని యాపిల్ పండ్లతో సీఎంను బుధవారం కలవనున్నారు. యాపిల్ పండ్ల బుట్టతోపాటు ఓ మొక్కను కూడా కేసీఆర్‌కు బహూకరించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సాగుచేస్తున్న యాపిల్ పంట ఇటీవలే చేతికొచ్చింది. తెలంగాణలో యాపిల్ పండించిన రైతు బాలాజీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆసిఫాబాద్ జిల్లాలోని యాపిల్ తోటను సందర్శించారు. మంత్రి, ఎమ్మెల్యే యాపిల్ తోటలో తిరుగుతూ మొక్కలు, పండ్లను ఆసక్తిగా పరిశీలించారు. రైతుతో మాట్లాడి యాపిల్ సాగు వివరాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.