యాప్నగరం

తెలంగాణ అసెంబ్లీ శనివారానికి వాయిదా

TS Assembly సెప్టెంబర్ 14కు వాయిదా పడింది. సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీని శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం ప్రకటించారు.

Samayam Telugu 9 Sep 2019, 1:04 pm
సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం తెలంగాణ శాసనసభ వాయిదా పడింది. శాసనసభను శనివారానికి (సెప్టెంబర్ 14) వాయిదా వేస్తున్నట్లు స్పీకరం పోచారం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం 2019-20 సంవత్సరానికి పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Samayam Telugu ts assembly


రూ. 1,46,492.3 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా పలు రంగాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించిందని తెలిపారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఆచితూచి కేటాయింపులు చేసినట్లు, ఖర్చులపై మంత్రులు, అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు.

Also Read: సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం..

విపత్కర పరిస్థితుల్లోనూ కీలకమైన పథకాలు కొనసాగించడానికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర ఫతకాలకు కేటాయింపులు ప్రకటించారు. సోమవారం ఉదయం 11:30 గంటలకు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. సుమారు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.