యాప్నగరం

PAC Chairmanగా అక్బరుద్దీన్ ఓవైసీ.. అసెంబ్లీ నిరవధిక వాయిదా

Telangana PAC Chairman | ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోవడంతో ఈ పదవి మజ్లిస్‌ నేతకి దక్కింది. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

Samayam Telugu 22 Sep 2019, 3:57 pm
ద్రవ్య వినిమయ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీ వాయిదా ప్రకటనకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ కమిటీలను ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమిస్తున్నట్టు తెలిపారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా సోలిపేట లింగారెడ్డి, పబ్లిక్ అండర్‌ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా ఆశన్నగారి జీవన్‌రెడ్డిని నియమిస్తున్నట్టు వెల్లడించారు.
Samayam Telugu akbarudding owaisi


కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో.. అసెంబ్లీలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఆ హోదా టీఆర్ఎస్ మిత్రపక్షమైన మజ్లిస్ పార్టీకి దక్కింది. ప్రతిపక్ష సభ్యులు కూర్చోవాల్సిన స్థానాలను స్పీకర్ ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు కేటాయించారు. తాజాగా ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది.

పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సభ్యులుగా కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు, ప్రకాశ్‌ గౌడ్, అబ్రహం, శంకర్‌ నాయక్, దాసరి మనోహర్‌ రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, అహ్మద్ పాషా ఖాద్రీ, కోరుకంటి చందర్‌లను నియమించారు.

అసెంబ్లీ సమావేశాలు పది రోజుల పాటు నడవగా.. సమావేశాలు 58 గంటల 6 నిమిషాలు కొనసాగాయి. ఈ సమావేశంలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని ఆమోదించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.