యాప్నగరం

17 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఇవాల ప్రారంభమైన సమావేశాలు మరో 17 రోజుల పాటు కొనసాగనున్నాయి. మధ్యలో నాలుగు రోజులు సభకు సెలవులు కూడా ప్రకటించారు. 28వరకు తెలంగాణ అసెంబ్లీ కొనసాగనుంది.

Samayam Telugu 7 Sep 2020, 5:09 pm
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం 17 రోజుల పాటు కొనసాగనున్నాయి. 12, 13, 20, 27వ తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ప్రకటించారు. శాసనసభలో గంట పాటు ప్రశ్నోత్తరాలకు కేటాయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో 6 ప్రశ్నలకు మాత్రమే అనుమతిచ్చారు. అర గంట పాటు జీరో అవర్ కొనసాగనుంది.
Samayam Telugu తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
telangana assembly


ఉభయసభల్లో ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ రెండు సంతాప తీర్మానాలను సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించి.. నివాళులర్పించారు. మాజీ సభ్యులు కావేటి సమ్మయ్య, జువ్వాడి రత్నాకర్ రావు, పోచయ్య, పి రామస్వామి, మస్కు నర్సింహ, బి కృష్ణ, సున్నం రాజయ్య, ఎడ్మ కిష్టారెడ్డి, మాతంగి నర్సయ్య మృతి పట్ల సభ నివాళులర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది.

Read More: తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు

అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.. అలాగే శాసనమండలిలో కూడా ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల హోంమంత్రి మహమూద్ అలీ సంతాప తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రణబ్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మండలిని కూడా రేపటికి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.