యాప్నగరం

ఇవాళ తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశం

11 గంటలకు సభ సమావేశం కానుంది. దీంతో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. గతంలో అసెంబ్లీకి వస్తున్న వారు కరోనా బారిన పడుతుండటంతో సమావేశాల్ని వెంటనే ముగించారు.

Samayam Telugu 13 Oct 2020, 8:07 am
తెలంగాణ శాసనసభ నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు మొదలవనున్న ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ సహా 4 చట్టసవరణ ముసాయిదా బిల్లులపై చర్చ జరుగనుంది. అలాగే వ్యవసాయ భూమి ఇతర అవసరాలకు వినియోగం, సీఆర్పీసీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టాలకు సంబంధించిన సవరణ బిల్లులపైనా చర్చ చేపట్టనున్నారు. ఎలాంటి ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా బిల్లులపై చర్చ జరుగనుంది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సభలో ఏర్పాట్లు చేశారు.
Samayam Telugu తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
telangana assembly


ఇవాళ శాసనసభ, బుధవారం మండలి సమావేశం కానున్నాయి. ఇందుకనుగుణంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్‌ చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా సీటింగ్‌ను ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. దీంతో సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చునే విధంగా స్థానాలను సర్దుబాటు చేశారు. ఈ ఏర్పాట్లను స్పీకర్‌, చైర్మెన్‌ పరిశీలించారు.

Read More: తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత

ఈసారి కూడా 2011 జనాభా లెక్కల ప్రకారమే జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2016లో కూడా ఆ లెక్కలతోనే ఎలక్షన్లు నిర్వహించిన సంగతి విదితమే. అయితే అప్పటి నుంచి ఇప్పటి దాకా జన గణన జరగలేదు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ రిజర్వేషన్లు, డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు, చేర్పులు చోటు చేసుకోలేదు. దీనిపై విపక్షాలు, మేధావులు ప్రశ్నిస్తూ వస్తున్నారు. మరోవైపు ఇద్దరికి మించి పిల్లలున్న వారు కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు వీల్లేదనే నిబంధన.. రాజకీయ అవసరాలరీత్యా సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఈ నిబంధనను ఈసారి కూడా ఎన్నికల్లో ఉంచుతారా ఎత్తేస్తారా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.