యాప్నగరం

ఖబడ్దార్ కేసీఆర్.. నీకు కౌంట్‌డౌన్ మొదలైంది.. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

ఓ సాధారణ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసిన తనను ఇంత పెద్ద జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం కేవలం బీజేపీ గౌరవమేనని కొనియాడారు. పార్టీలోని ప్రతి సామాన్య కార్యకర్తకు ఇది గౌరవమేనని చెప్పారు. ఈ పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిపించిన ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు నిరంతరం పని చేస్తానని చెప్పారు. తనపై ఉన్న విశ్వాసంతో అధిష్ఠానం అప్పగించిన ఈ బాధ్యతను అందరి ఆశీస్సులతో నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా బండి సంజయ్ హైదరాబాద్‌ వచ్చారు. ఈయనకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ నేతలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.

Samayam Telugu 15 Mar 2020, 7:38 pm
ఓ సాధారణ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసిన తనను ఇంత పెద్ద జాతీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం కేవలం బీజేపీ గౌరవమేనని కొనియాడారు. పార్టీలోని ప్రతి సామాన్య కార్యకర్తకు ఇది గౌరవమేనని చెప్పారు. ఈ పదవి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిపించిన ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు నిరంతరం పని చేస్తానని చెప్పారు. తనపై ఉన్న విశ్వాసంతో అధిష్ఠానం అప్పగించిన ఈ బాధ్యతను అందరి ఆశీస్సులతో నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా బండి సంజయ్ హైదరాబాద్‌ వచ్చారు. ఈయనకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ నేతలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.
Samayam Telugu telangana bjp chief bandi sanjay makes sensational comments on kcr
ఖబడ్దార్ కేసీఆర్.. నీకు కౌంట్‌డౌన్ మొదలైంది.. బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు


‘మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందే..’

అనంతరం సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడేలా ఎగురవేస్తాం. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తాం. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదు. అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రాజ్యం ఏలుతున్నారు. బీజేపీ కార్యకర్తలు, యువకులపై ఒక్క లాఠీ దెబ్బ పడ్డా చూస్తూ ఊరుకోను. రాష్ట్రంలో ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ ఒక నియంతలా వ్యవహరిస్తోంది. తెలంగాణలో మరో పార్టీ అధికారంలోకి రావాల్సిందే.’’

‘ఈ ముఖ్యమంత్రి అవసరమా?’

‘‘రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం ఇచ్చే నిధులు కేసీఆర్ సొత్తు కాదు. కేంద్రం ఇచ్చే నిధులను తామే ఇస్తున్నట్లుగా రాష్ట్రం ప్రచారం చేసుకోవడం అత్యంత దారుణమైన విషయం. రాష్ట్రంలో బతుకు తెరువు కోసం యువకులు, నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్య కోసం 15 శాతానికి పైగా నిధులు కేటాయిస్తుంటే.. తాజా బడ్జెట్‌లో కేవలం 7 శాతం నిధులు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాశాఖను దారుణం చేసింది. ఆర్టీసీ కార్మికులు, ఇంటర్‌ విద్యార్థులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం కేసీఆర్‌ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి సీఎం మనకు అవసరమా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు.

‘ఖబడ్దార్ కేసీఆర్’

యువకులే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేస్తే వారి రక్తపు మడుగుల పునాది నుంచి కేసీఆర్ రాజ్యమేలుతున్నారు. రేపు ఆ దమ్మున్న యువకులే నీకు గోరీ కడతారు. నీ ఫాంహౌస్, ప్రగతి భవన్ సంగతేంటో చూస్తారు. నీ కోటను బద్దలు కొడతారు. గుర్తుంచుకో. గోల్కొండపై కేవలం బీజేపీ జెండా రెపరెపలాడిస్తాం. మైనారిటీ ఓట్లతో రాజ్యమేలాలంటున్న నీ ఆటలు ఇక సాగవు. కానీ బీజేపీ అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది. తెలంగాణ అధ్యక్షుడిగా ప్రజలకు నేను అండగా ఉంటా. ఖబడ్దార్ కేసీఆర్.. రేపటి నుంచి నీకు యుద్ధం మొదలవుతుంది. ఈరోజే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. నా కార్యకర్తలపై ఒక్క లాఠీ దెబ్బ పడినా నీ గుండెల్లో నేను నిద్రపోతా.’’

Also Read: అందరం టీఆర్ఎస్ ముక్కు కోసేద్దాం.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

‘చావే నన్ను చూసి భయపడుతుంది’

‘‘మా కార్యకర్తలు లాఠీ దెబ్బలకు భయపడడు. మమ్మల్ని అరెస్టు చేయాలంటే నువ్వు ఇంకా అదనపు జైళ్లు కట్టుకోవాలి. ఈ బండి సంజయ్ కూడా దేనికీ భయపడడు. చావే నన్ను చూసి భయపడుతుంది. ప్రజల కోసం పని చేస్తాం. త్యాగం చేస్తాం. ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధం. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండాను రెపరెపలాడించే వరకూ పని చేస్తాం. తెలంగాణ ప్రజలందరికీ అండగా ఉంటా. మరో మూడేళ్లు అందరూ కాషాయ జెండా పట్టుకొని నినదించండి. తర్వాత అధికారంలోకి వచ్చేది కేవలం బీజేపీ మాత్రమే.’’ అని బండి సంజయ్ ప్రసంగించారు.

Also Read: ఎంపీ బండి సంజయ్‌కు డబుల్ ధమాకా.. కేంద్రం మరో తీపి కబురు


Also Read: ఉమ్మడి ఏపీనే బాగుండేది.. అనవసరంగా విడిపోయాం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Twitter-BJP Telangana

Twitter-BJP Telangana

Twitter-BJP Telangana

Twitter-BJP Telangana

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.