యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ

Telangana BJP: పాకిస్థాన్ నుంచి వచ్చిన వారిని ఇక్కడి నుంచి ఎవరూ పంపలేరని, తాము బతికుండగా అది జరగదని కొద్ది రోజుల క్రితం అరెకపూడి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పర్యటిస్తూ సీఏఏకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు.

Samayam Telugu 29 Feb 2020, 11:19 am
టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై తెలంగాణ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన సీఏఏపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందుకే ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు.
Samayam Telugu bjp flags


పాకిస్థాన్ నుంచి వచ్చిన వారిని ఇక్కడి నుంచి ఎవరూ పంపలేరని, తాము బతికుండగా అది జరగదని కొద్ది రోజుల క్రితం అరెకపూడి వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని అక్కడ పర్యటిస్తూ సీఏఏకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని విమర్శించారు. అవసరం అయితే అసదుద్దీన్ ఓవైసీతో కలిసి మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో బహిరంగ సభ ఏర్పాటు చేయిస్తామన్నారు. పోలీసులతో అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణలో సీఏఏ అమలు కాదని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు.

Also Read: ఫోన్ చేసి తండ్రిని పిలిచాడు.. చూస్తుండగానే జలపాతంలోకి దూకాడు

ఈ వ్యాఖ్యలపై వివాదం రేగడంతో తర్వాత ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ వివరణ ఇచ్చారు. సుదీర్ఘ కాలంగా ఇక్కడ నివసిస్తున్న మైనార్టీలకు ఎలాంటి భయం లేదని భరోసా ఇచ్చేందుకే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. ఇటీవల ఇక్కడికి వలస వచ్చిన వారికి, దేశ వ్యతిరేకుల విషయంలో ఈ వ్యాఖ్యలు వర్తించబోవని అరెకపూడి గాంధీ స్పష్టత ఇచ్చారు.

Also Read: రాచకొండ సీపీ ఔదార్యం.. యువతికి మందురాసి, కట్టు కట్టి.. నెటిజన్ల పొగడ్తలు

Also Read: కరెంటు ఛార్జీల బాదుడు.. టారీఫ్‌ల పెంపునకు సీఎం గ్రీన్ సిగ్నల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.