యాప్నగరం

KCR సర్కారుపై నిరసన.. నల్ల జెండా ఎగరేసిన కమలనాథులు

Pothireddypadu Head Regulatory సామర్థ్యాన్ని పెంచడానికి జగన్ సర్కార్ జీవో జారీ చేయడంతో.. కేసీఆర్ సర్కారు తీరును తప్పుబడుతూ బీజేపీ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తోంది.

Samayam Telugu 16 May 2020, 2:17 pm
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడానికి జగన్ సర్కారు జారీ చేసిన జీవో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారని కేసీఆర్ సర్కారు బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. కేసీఆర్ కావాలనే మౌనంగా ఉన్నారని ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు వేర్వేరుగా నిరసనలు చేపట్టాయి. కాగా బీజేపీ నల్ల జెండాలతో నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన ఇంటిపై నల్ల జెండా ఎగరేశారు.
Samayam Telugu నల్ల జెండా కడుతున్న బండి సంజయ్


‘‘పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసినా, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అసమర్థ కెసిఆర్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నల్ల జెండాలను ఎగురవేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింద’’ని బండి సంజయ్ తెలిపారు.

రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి, ప్రజలకు న్యాయం దక్కే వరకూ తెలంగాణ బీజేపీ ప్రజా పోరాటాలను నిర్వహిస్తుందని సంజయ్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.