యాప్నగరం

టచ్‌లో 25 మంది.. బాంబు పేల్చిన బీజేపీ ఇన్‌చార్జి, ఆట మొదలైందా?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా? కారు ఓవర్ లోడ్ కమలం పార్టీకి కలిసొస్తుందా? తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి తరుణ్ చుగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Samayam Telugu 26 Nov 2021, 8:18 pm
దుబ్బాక విజయంతో రేసులో స్పీడు పెంచిన బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓడించినంత పనిచేసి అధికార టీఆర్‌ఎస్‌కి దిమ్మతిరిగే షాకిచ్చింది. సాగర్‌లో వెనకపడినా సీనియర్ నేత జానా రెడ్డి ఖాతాలో పడిపోయింది. తాజాగా హుజూరాబాద్‌లో ఘన విజయంతో కమలం పార్టీ జోరుమీదుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి గెలిచి సత్తాచాటిన ఈటల రాజేందర్ కమలానికి అప్రకటిత స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ ఎప్పటికప్పుడు జనంలోకి దూసుకెళ్లేలా ముందుకెళ్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
bjp


అటు అధిష్టానం ఆశీస్సులు కూడా మెండుగానే ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం మెడలు వంచుతామంటూ బీరాలు పలికిన కేసీఆర్ ప్రధానిని కలవకుండానే వెనుదిరిగి రావడం కూడా రాష్ట్ర బీజేపీకి కలిసొచ్చింది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు ఓవర్ లోడ్ కారణంగా అధికారపార్టీలో అసమ్మతి సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే మహబూబ్‌నగర్‌కి చెందిన సాయిచంద్, నిజామాబాద్ నుంచి ఆకుల లలిత, కరీంనగర్ నుంచి రవీందర్ సింగ్ వంటి నేతలు చివరివరకూ అవకాశం దక్కుతుందని ఎదురుచూసి నిరాశకు గురయ్యారు.

సరిగ్గా ఇదే సమయంలో మరో బాంబు పేల్చారు బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్. తమతో 25 మంది నేతలు టచ్‌లో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచి నేతలు టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌కి ఢిల్లీలో షాక్ తగిలిందన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌కి 60 మంది అభ్యర్థులు కూడా దొరకరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీకి 80 సీట్లు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.