యాప్నగరం

రాములమ్మ చేరికతో బీజేపీలో కొత్త జోష్.. ఆ కీలక బాధ్యతలు ఆమెకే..!

Telangana BJP: రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఈ బస్సు యాత్రను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లాలని అధిష్ఠానం భావిస్తోంది.

Samayam Telugu 24 Dec 2020, 10:30 pm
కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీలో చేరడంతో పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చినట్లయింది. అధికార పార్టీపై ముఖ్యంగా కేసీఆర్‌పై రాములమ్మ తరచూ ప్రశ్నించే సంగతి తెలిసిందే. దీంతో ఆమె రాక బీజేపీని బలోపేతం చేయడంలో బాగా కలిసొస్తుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే విజయశాంతికి రాష్ట్రంలో అనేక కీలకమైన బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీజేపీ చేపట్టనున్న బస్సు యాత్ర బాధ్యతలన్నీ విజయశాంతికే అప్పగించాలని పార్టీ భావిస్తోందని తెలుస్తోంది.
Samayam Telugu విజయశాంతి
Vijayashanti


రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఈ బస్సు యాత్రను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి మరింతగా చొచ్చుకెళ్లాలని అధిష్ఠానం భావిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక బీజేపీ అనూహ్యంగా ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యర్థిగా మారింది.

దుబ్బాక ఉప ఎన్నికలో గెలవడంతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికలలోనూ ఊహించని ఫలితాలను రాబట్టి బీజేపీ.. గులాబీ అగ్ర నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. త్వరలో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేళ ఇంతే దూకుడుగా వెళ్లాలని బీజేపీ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలతో పాద యాత్ర నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అంతకన్నా ముందు రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర నిర్వహించాలని తలపెట్టారు.

ఇవి కూడా చదవండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.