యాప్నగరం

Bandi Sanjay: ఆ భయంతోనే రేవంత్ రెడ్డి ఏడ్చారు: బండి సంజయ్

Bandi Sanjay: రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను వెనకేసుకొచ్చారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ రూ.25 కోట్లు ఇచ్చిందని ఈటల అనలేదన్నారు.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 23 Apr 2023, 2:28 pm

ప్రధానాంశాలు:

  • పదవి పోతుందనే భయంతోనే కన్నీళ్లు పెట్టుకున్నారు
  • బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయి
  • రేవంత్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Bandi Sanjay: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. రేవంత్ రెడ్డి ఎందుకు బాధపడ్డారనే విషయం బయటకు రావాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని రాజేందర్ చెప్పారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులే అలా చెప్పారని, రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారంటే తప్పు అవుతుందన్నారు.
ఈటల మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్నారని అనలేదని బండి సంజయ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ డబ్బు తీసుకుందనే మొదటి నుంచి చెప్తున్నామన్నారు. తన పదవి పోతుందనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారని, బీఆర్ఎస్ దగ్గర కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమన్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలో రేవంత్ సతమతం అవుతున్నారని, కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ ఆర్ధిక సాయం చేస్తుందని బండి సంజయ్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని, మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందన్నారు. కాంగ్రెస్ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి పోయిందని, అందుకే పదవి పోతుందని రేవంత్ ఏడుస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ డబ్బులు తీసుకుందనే విషయం మునుగోడు ఉపఎన్నికల సమయంలో బాగా ప్రచారం అయిందని బండి సంజయ్ తెలిపారు. మునుగోడు ఓటర్లు స్వయంగా ఈ విషయం మాట్లాడుకున్నారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీనియర్ నేత జానారెడ్డిలే చెబుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆర్థిక సహాయం చేస్తుందనే విషయం రాజ్దీప్ సర్దేశాయి చెప్పిన విషయాన్ని బండి సంజయ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.