యాప్నగరం

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మృతి

వివేకానంద సేవా సమితి సభ్యులుగా ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Samayam Telugu 27 Dec 2020, 7:38 am
తెలంగాణ బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నాయకుడు మాధవరం భీం రావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. వివేకానంద సేవా సమతి సభ్యులుగా పలు సేవాకార్యక్రమాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. భారత్‌ వికాస్‌ ఫౌండేషన్‌లో కూడా మాధవరం భీంరావు కీలక బాధ్యతలు చేపట్టారు. వివేకానంద నగర్‌ కాలనీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భీమ్‌రావు మృతిపట్ల బీజేసీ రాష్ట్ర నాయకుడు జ్ఞానేంద్రప్రసాద్‌ సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.