యాప్నగరం

తెలంగాణ కేబినెట్ భేటీ... లాక్‌ డౌన్‌పై కాసేపట్లో కేసీఆర్ కీలక ప్రకటన

ప్రగతి భవన్‌లో మొదలైన తెలంగాణ కేబినెట్ భేటీ. లాక్ డౌన్ పై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం. మరో రెండు వారాల పాటు లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

Samayam Telugu 11 Apr 2020, 3:56 pm
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని , మరికొంత కాలం లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇది వరకే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై ఇవాళ ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. దీంతో కేంద్రం పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు లాక్ డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించినట్లు సమాచారం. దీనిపై మంత్రులతో సమావేశమైన కేసీఆర్... ఈ విషయాన్ని కేబినెట్ భేటీ అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Samayam Telugu kcr new


ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ పెంపునకు మొగ్గు చూపుతూ, ఏప్రిల్ 30 వరకు పొడిగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
లాక్ డౌన్‌తో పాటు ధాన్యం కొనుగోళ్లు, రైతులకు మద్ధతు ధరపై కూడా మంత్రివర్గం చర్చిస్తున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణలో లాక్ డౌన్‌పై కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు 400 దాటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.