యాప్నగరం

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ... లాక్‌డౌన్‌పై కీలక ప్రకటన

లాక్‌డౌన్‌ పెట్టాలా? వద్దా? అని చర్చించి ప్రజలకు ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి.

Samayam Telugu 10 May 2021, 8:50 pm
తెలంగాణ రాష్ట్రంలో 20 రోజులుగా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నా కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన పడింది. లాక్‌డౌన్ పెట్టాలంటూ అనేక వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
Samayam Telugu Image


రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంలేదన్న రిపోర్టులు అందుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం వల్ల కలిగే పరిణామాల అంశంపై మంగళవారం క్యాబినెట్ చర్చించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.