యాప్నగరం

కేంద్ర చట్టానికి కేసీఆర్ సై.. ఇక వాళ్లకు గుడ్‌న్యూస్‌‌‌! సడెన్‌గా సీఎం కీలక నిర్ణయం

Telangana: గత సార్వత్రిక ఎన్నికలు ముందు మోదీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్ని రాజకీయ పక్షాలు దీన్ని సమర్థించినా దీనిపై అప్పట్లో దుమారం కూడా రేగింది.

Samayam Telugu 21 Jan 2021, 5:01 pm
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యుఎస్) పది శాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
Samayam Telugu కేసీఆర్
kcr


‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలతో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

గత సార్వత్రిక ఎన్నికలు ముందు మోదీ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అన్ని రాజకీయ పక్షాలు దీన్ని సమర్థించినా దీనిపై అప్పట్లో దుమారం కూడా రేగింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని చాలా మంది నిపుణులు వాదించారు. చట్టం తీసుకొచ్చిన వెంటనే పలు రాష్ట్రాల్లో ఈ సౌకర్యాన్ని అమలు చేశారు. తెలంగాణలో మాత్రం చేయలేదు. తాజాగా దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.