యాప్నగరం

సౌందర రాజన్‌కు కేసీఆర్ అభినందనలు.. సాదర ఆహ్వానం

తెలంగాణ గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర రాజన్‌కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

Samayam Telugu 1 Sep 2019, 10:12 pm
తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన తమిళి సై సౌందర రాజన్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ గవర్నర్‌గా సౌందర్ రాజన్‌ను నియమిస్తూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
Samayam Telugu kcr soundara rajan


తెలంగాణ గవర్నర్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తోన్న నరసింహన్‌‌ను కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్ భవన్ వెళ్లిన ఆయన నరసింహన్‌తో సమావేశమయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ గవర్నర్‌గా రాబోతున్న తమిళి సై సౌందర్ రాజన్‌కు టీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హిమాచల్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. సుదీర్ఘ కాలంపాటు తెలంగాణకు గవర్నర్‌గా పని చేసిన నరసింహన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.