యాప్నగరం

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ బంపర్ గిఫ్ట్.. కొత్త సంవత్సర కానుక

New Year 2020: ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీపై భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని, ఫిబ్రవరిలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

Samayam Telugu 29 Dec 2020, 7:46 pm
తెలంగాణ‌లో ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ కొత్త సంవత్సరం బహుమతి ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు పదవి విరమణ వయస్సు కూడా పెంచేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతో పాటు పింఛనుదారులకు ఇచ్చే పింఛను కూడా పెంచేందుకు ఆమోదం తెలిపారు. దీంతో పాటు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు.
Samayam Telugu తెలంగాణ ప్రభుత్వం
Telangana government


ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచేందుకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీపై భారమంతా ప్రభుత్వమే భరిస్తుందని, ఫిబ్రవరిలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర గొప్పదని, మార్చి నుంచి ఉద్యోగులంతా సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఉంటాయని.. పదవీ విరమణ రోజే ఆఫీసులో ఘనంగా సన్మానం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే రిటైర్మెంట్ రోజే పదవీ విరమణ బెనిఫిట్లు అందుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 9,36,976 మంది ఉద్యోగులకు పెంపు వర్తించనుంది.

ఇవి కూడా చూడండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.