యాప్నగరం

ధరణి పోర్టల్ ప్రారంభంచిన సీఎం కేసీఆర్.. నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు

ఇకపై భూముల రిజిస్ట్రేషన్‌కు పైరవీలు అవసరం ఉండదన్నారు. వీఆర్వోలను కూడా ఖాళీలు ఎక్కడ ఉంటే అక్కడ అడ్జెస్ట్ చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Samayam Telugu 29 Oct 2020, 2:03 pm
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు..మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ధరణి పోర్టర్‌ అధికారికంగా ప్రారంభించారు..రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తుంది. దీంతో ఇకపై అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రతీ ఇంటి జాగాను కూడా త్వరలోనే కొలుస్తామన్నారు. పోర్టల్‌లో భూమి వివరాలు ఎక్కడ నుంచి అయినా చూసుకోవచ్చన్నారు.
Samayam Telugu ధరణిని ప్రారంభించిన కేసీఆర్
kcr launch dharani website


పావుగంటలోనే రిజిస్ట్రేసన్ మ్యాటేషన్ జరుగుతుందన్నారు. పోర్టల్‌లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు వస్తాయన్నారు సీఎం. ప్రతీ ఇంచు భూమిని డిజిటిలైజేషన్ చేస్తామన్నారు. భూ సమస్య రైతుకు తలనొప్పిగా మారిందన్నారు. ధరణి పూర్తి పారదర్శకంగా ఉందన్నారు. భూముల గోల్ మాల్ సంగతే ఉండదన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగే పని ఉండదన్నారు. జిల్లాకో టెక్నికల్ టీం ఏర్పాటు చేస్తామన్నారు.ఇకపై రిజిస్ట్రేషన్లకు పైరవీలు అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. ఎండోమెంట్, వక్ఫ్ భూముల కబ్జాలు కూడా ఉండవన్నారు.

Read More: సీఎం దత్తత గ్రామానికే దస్తావేజుల్లేవు.. ధరణి ప్రారంభం అక్కడినుంచే

వచ్చే నెల 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమలులోకి వస్తుంది..మోసాలకు ఆస్కారమే లేకుండా..ప్రజల్లో గందరగోళం లేకుండా పక్కాగా..సులువుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని.. వెరిఫికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకూ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. కేవలం పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు..భూమి వివరాలు క్రయవిక్రయాలును తెలుసుకునే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

ఇప్పటికే తాసిల్దార్‌ కార్యాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా పది లావాదేవీలను సక్సెస్‌గా నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు పూర్తికాగానే మ్యుటేషన్‌ పూర్తవుతుంది. తాసిల్దార్‌ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, స్కానర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ల కోసం అనుభవం ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లకు లైసెన్స్‌లను సైతం ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.