యాప్నగరం

కేసీఆర్‌కు షాక్.. తగ్గిన ప్రజాదరణ.. 14 నెలల్లో సీన్ రివర్స్!

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో జగన్ టాప్-5లో చోటు దక్కించుకోగా.. కేసీఆర్‌కు ప్రజాదరణ తగ్గిందని సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

Samayam Telugu 3 Jun 2020, 8:20 am
రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరు గురించి సీ-ఓటర్ నిర్వహించిన సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టాప్-5లో చోటు దక్కకపోవడం షాక్‌కు గురి చేసింది. అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉండగా.. కేరళ సీఎం పినరయి విజయన్‌తో పోటీ పడుతూ వైఎస్ జగన్ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఇదే సమయంలో కేసీఆర్ గ్రాఫ్ పడిపోయినట్లు ఈ సర్వే పేర్కొనడం గమనార్హం.
Samayam Telugu kcr
telangana cm kcr


అత్యల్ప ప్రజాదరణ ఉన్న నేతల జాబితాలో తెలంగాణ సీఎం పేరు ఉండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. మమతా బెనర్జీ, నితీశ్ కుమార్ కూడా ప్రజాదరణ విషయంలో వెనుక బడ్డారని ఈ సర్వే వెల్లడించింది. విచిత్రం ఏంటంటే.. గత లోక్ సభ ఎన్నికల ముందు సీఓటర్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా కేసీఆర్ నిలిచారు. 14 నెలల్లోనే ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన సీఎం స్థాయి నుంచి ప్రజాదరణ కోల్పోయిన సీఎంల జాబితాలోకి మారడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గత ఏడాది ఆగష్టులో వీడీపీ అసోసియేట్స్ సంస్థ 'దేశ్ కా మూడ్' పేరిట నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంల జాబితాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడో స్థానంలో నిలవగా కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. అప్పుడు కూడా నవీన్ పట్నాయక్ నంబర్ వన్‌గా నిలవగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు.

సీ-ఓటర్ సర్వేలో కేసీఆర్ టాప్-5లో చోటు దక్కించుకోకపోవడం వల్ల ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేం లేదు. కానీ పాలనలో మార్పులు చేసుకోవాలనే విషయాన్ని మాత్రం సూచిస్తోంది. కేసీఆర్ కూడా ప్రజల మూడ్‌కు అనుగుణంగా పాలన సాగిస్తారు. జనం నాడి పట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా. చివరగా మరో విషయం ఏంటంటే.. గత లోక్ ‌సభ ఎన్నికల ముందు సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో చంద్రబాబు 14వ స్థానంలో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.