యాప్నగరం

భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ ఆరా.. ఢిల్లీ నుంచి సీఎస్‌కు ఫోన్, కీలక ఆదేశాలు జారీ

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిపై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్‌లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు.

Samayam Telugu 7 Sep 2021, 12:31 pm
రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో ఆయా గ్రామాలు, మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Samayam Telugu kcr


ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సహాయచర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.