యాప్నగరం

అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్

Kanchi | తమిళనాడులోని కంచి వరదరాజు స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంతో కలిసి సోమవారం దర్శించున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.

Samayam Telugu 12 Aug 2019, 4:25 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తమిళనాడులోని కంచి అత్తి వరదరాజు స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, పూజార్లు కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ వేద పండితులు, కేసీఆర్ దంపతులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కంచి పర్యటనలో కేసీఆర్ దంపతుల వెంట వారి కుమార్తె , మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కూడా పాల్గొన్నారు.
Samayam Telugu Kcr


ఘన స్వాగతం పలికిన రోజా..
సీఎం కేసీఆర్ కంచి పర్యటనలో భాగంగా అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రేణిగుంట నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి బయలుదేరారు. మార్గమధ్యంలోని నగరి వద్ద వైసీపీ ఎమ్మెల్యే కేసీఆర్ కుటుంబానికి ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ ఆమెతో కాసేపు చర్చించి కంచికి వెళ్లారు. దర్శన అనంతరం తిరుగు ప్రయాణంలో కేసీఆర్ తిరుమల చేరుకుని, శ్రీవారిని దర్శించుకోనున్నారు. తిరిగి రేణిగుంట చేరుకొని, ప్రత్యేక విమానంలో సాయంత్రం హైదరాబాద్ రానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.