యాప్నగరం

యాదాద్రి పర్యటనలో కేసీఆర్.. ఆ యాగం కోసమేనా..?

KCR యాదాద్రిలో పర్యటించారు. తొలుత దైవ దర్శనం చేసుకున్న కేసీఆర్ అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ ఆవరణ మొత్తం కలయ తిరుగుతూ పనులు జరుగుతున్న సరళిని పరిశీలించారు.

Samayam Telugu 17 Dec 2019, 4:35 pm
సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించారు. ఉదయం యాదాద్రికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల తర్వాత అర్చకులు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దైవ దర్శనం చేసుకున్న కేసీఆర్ అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ ఆవరణ మొత్తం కలయ తిరుగుతూ పనుల సరళిని పరిశీలించారు. వెంట ఉన్న ఉన్నతాధికారును అడిగి వివరాలు తెలుసుకున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి చేయించాలని కేసీఆర్ ఆదేశించారు.

Must Read: సమత కేసు: నిందితులు కోర్టు ముందుకు.. సీరియస్‌గా విచారణ

ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ మహాకుంభాభిషేకం అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. పర్యటన అనంతరం ఉన్నతాధికారులు, ఆలయ సిబ్బందితో సీఎం సమీక్ష నిర్వహించే అవకాశముంది. ప్రధాన ఆలయ నిర్మాణాలను పూర్తి చేసి, వచ్చే బ్రహ్మోత్సవాలనాటికి భాగంగా మహాకుంభాభిషేకం నిర్వహించాలన్న యోచనలో సీఎం పర్యటన సాగుతోంది.

Must Read: న్యాయం కోసం ఆరుగురు రైతుల మూకుమ్మడి ఆత్మహత్యాయత్నం..

యాదాద్రిపై గత ఆగస్టులో సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష దాదాపు 5 గంటల పాటు సాగింది. సీఎం పర్యటన తర్వాత నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ఇప్పుడు మరోసారి కేసీఆర్ రావడంతో వచ్చే రెండు నెలల్లో చేపట్టబోయే కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తయ్యే అవకాశముంది. కొద్ది నెలల క్రితం ఆలయ స్తంభాలపై స్వాతంత్ర సమరయోధులు సహా కేసీఆర్ బొమ్మలు చెక్కడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

See Photo Story: యాదాద్రి లక్ష్మీ నరసింహుని సేవలో సీఎం కేసీఆర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.