యాప్నగరం

ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా... లేదా?

ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఐఏఎస్ నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం!

Samayam Telugu 24 Jan 2022, 10:49 pm
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (కేసీఆర్‌) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.
Samayam Telugu ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)


రాష్ట్రాల్లో పని చేసే అధికారులను కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడలో భాగంగానే ఈ సవరణలు చేశారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. నిబంధనలను సవరించడం వల్ల రాష్ట్ర పరిపాలన చిక్కుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్న సీఎం కేసీఆర్‌.. ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్పు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

కాగా, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్‌ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలను పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు. ఈ ప్రతిపాదనలను విరమించుకోవాలని ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.