యాప్నగరం

ఏపీకి మూడు రాజధానులపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

AP Capital గురించి వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇటీవల జగన్ చేసిన ప్రకటనతో వివాదం తలెత్తింది. ఈ వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ స్పందించారు.

Samayam Telugu 20 Dec 2019, 3:47 pm
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఈ అంశంపై కొందరు నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తాజాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) స్పందించారు. ఆయన శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల వల్ల ఏ ప్రయోజనమూ లేదని వ్యాఖ్యానించారు. దీనివల్ల నష్టమే తప్ప, ఎటువంటి లాభమూ లేదని అన్నారు. ప్రజా ధనం భారీగా వృథా అవుతుందని అభిప్రాయపడ్డారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉండగా, మూడు రాజధానుల అంశం అర్ధరహితమని కొట్టిపారేశారు.
Samayam Telugu V Hanumantha Rao


Also Read: డెలివరీ సమయంలో శిశువు తల కోసేసి.. డాక్టర్ అంతులేని నిర్లక్ష్యం

తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు తమ ఉనికిని చాటుకోవడం కోసమే, రాజధానులు, కొత్త నిర్మాణాల అంశాన్ని లేవనెత్తుతున్నారని వీహెచ్ విమర్శించారు. జగన్‌ను కేంద్రమే నియంత్రించాలని కోరిన వీహెచ్.. ఆయన తాను ఇచ్చిన హామీలపై పని చేయాలని హితవు పలికారు.

Also Read: రోడ్డుపై ఇలా చేస్తున్నారా.. ఇక మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దే!!

ఏపీకి మూడు రాజధానుల అంశంపై ఇటీవల ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు కూడా స్పందించిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనకు మద్దతు పలికిన ఆయన తెలంగాణలోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కేసీఆర్‌ను కూడా కోరతానని, హైదరాబాద్‌కు ఆదిలాబాద్ చాలా దూరం కాబట్టి కనీసం ఏడాదికి రెండు సార్లు శాసనసభ సమావేశాలు ఆదిలాబాద్‌లో నిర్వహించాలని వ్యాఖ్యలు చేశారు.

Also Read: బస్సులో టికెట్ తీసుకోలేదా.. ఇక అంతే సంగతులు..!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.