యాప్నగరం

గవర్నర్ ఓకే అన్నారు.. సీఎం కేసీఆర్ రాజీనామా చేయాల్సిందే: కాంగ్రెస్

Hyderabad: వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయాల‌ని, హాస్పిటళ్లలో పడకలు పెంచాలని కొన్ని నెలల క్రితమే గవర్నర్ సూచించారని భట్టి గుర్తు చేశారు. గవర్నర్ సూచనలను పట్టించుకోకపోవడం వల్లనే కరోనా బాగా వ్యాప్తి చెందిందని విమర్శించారు.

Samayam Telugu 19 Aug 2020, 4:45 pm
క‌రోనా పరిస్థితులు నెలకొన్న వేళ గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సూచనలు చేస్తే.. వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టడం మానేసి అధికార పార్టీ నాయ‌కులు తిరిగి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. వైరస్ విజృంభణ గురించి గవర్నర్ ముందే గ్రహించారని, ప్రభుత్వానికి లేఖలు కూడా రాశార‌ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా వైద్యశాఖలో పోస్టులు భర్తీ చేయాల‌ని, హాస్పిటళ్లలో పడకలు పెంచాలని కొన్ని నెలల క్రితమే ఆ లేఖల్లో సూచించారని భట్టి గుర్తు చేశారు. గవర్నర్ సూచనలను పట్టించుకోకపోవడం వల్లనే కరోనా బాగా వ్యాప్తి చెందిందని విమర్శించారు.
Samayam Telugu కేసీఆర్, గవర్నర్ (ఫైల్ ఫోటోలు)
KCR Press meet


కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వానికి సూచనలు చేస్తూ పలుసార్లు లేఖలు రాసింద‌ని భట్టి గుర్తు చేశారు. ప్రతిపక్షాల‌పై, మీడియా పై ఎదురుదాడి చేయడమే కాకుండా గవర్నర్‌ను సైతం ఎదిరించడం ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేస్తే విలువలు ఉన్న సీఎంలు గతంలో రాజీనామాలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ఏమాత్రం రాజ్యాంగ విలువలు ఉన్న వ్యక్తి అయితే వెంటనే రాజీనామా చేయాలని భ‌ట్టి డిమాండ్ చేశారు. రాజ్యాంగం సృష్టించిన పదవి గవర్నర్ పోస్టు కాబట్టి.. వారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని సీఎం క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు.

Must Read: undefined

కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను గవర్నర్ ఒప్పుకున్నారు కాబట్టి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కరోనా చికిత్సను కేంద్రంలో ఉన్న ఆయుష్మాన్ భారత్ లేదా ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ఆయన కోరారు. కరోనా విషయంలో ప్రభుత్వాన్ని గవర్నర్ ముందే అప్రమత్తం చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. గవర్నర్ సూచనలను కేసీఆర్ సర్కార్ పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.

కరోనా గురించి అసెంబ్లీలో తాము మాట్లాడితే సీఎం కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం, మంత్రులు మాటలతో టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రూ.5 వేలు, రూ.10 వేలు ఇస్తే ఓట్లు పడతాయనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.