యాప్నగరం

గవర్నర్‌కు కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ కాంగ్రెస్.. గవర్నర్ తమిళసైకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా కూనీ అవుతుందో గవర్నర్‌కు వివరించామని తెలిపారు.

Samayam Telugu 18 Sep 2019, 12:06 am
తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు మంగళవారం (సెప్టెంబర్ 17) గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మంత్రివర్గంలో తలసాని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇచ్చి ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని.. తాజాగా పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్‌లోకి తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu batti


గవర్నర్‌ను కలిసిన అనంతరం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క.. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన సబిత ఇంద్రారెడ్డిని మంత్రి వర్గంలో తీసుకుని తెలంగాణ సర్కార్‌ మరోమారు ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కిందని ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా కూనీ అవుతుందో గవర్నర్‌కు వివరించామని తెలిపారు.

కాంగ్రెస్ శాసనసభ పక్షంలోని 12 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు అంశం హైకోర్టులో ఉందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. వారి వీలినం చెల్లదని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలు కోర్టుకు అందించామని మల్లు భట్టువిక్రమార్క వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.