యాప్నగరం

కాంగ్రెస్‌ తీరుపై సోనియాకు ఫిర్యాదు చేస్తా.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

Telangana Congress: తెలంగాణలో తాజా మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఈ విషయాలపై తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వీహెచ్ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతీయాతో పాటు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని అడుగుతానని ఆయన పేర్కొన్నారు.

Samayam Telugu 30 Jan 2020, 7:22 pm
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతం మారిందేమోనని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు (వీహెచ్) అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని అడుగుతానని గురువారం మీడియాతో అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన తీరుపై వీహెచ్‌ మీడియాతో మాట్లాడారు. మతతత్వ భావజాలం గల బీజేపీతో తామెప్పుడు కలవలేదని గుర్తు చేశారు. తాజాగా యాచారంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాక, మణికొండలో బీజేపీతో కలిసి మున్సిపాలిటీని గెలుచుకోవడం అవసరమా? అని ప్రశ్నించారు.
Samayam Telugu V Hanumantha Rao


Also Read: రేప్ చేస్తున్నప్పుడు మీరు చూశారా? సమత దోషుల తరపున సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో తాజా మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన ఈ విషయాలపై తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని వీహెచ్ చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతీయాతో పాటు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని అడుగుతానని ఆయన పేర్కొన్నారు. మున్సిపాలిటీ పోతే పోయింది కానీ.. సిద్ధాంతం వదలకూడదని హితవు పలికారు. మణికొండ మున్సిపాలిటీలో అధికార పార్టీకి మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి దక్కకుండా ఉండేందుకు బద్ధ శత్రువులుగా ఉండే కాంగ్రెస్‌, బీజేపీలు స్థానికంగా ఒక్కటయ్యాయని.. ఈ అనైతిక పొత్తుపై వీహెచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: కోర్టు తీర్పుపై సమత భర్త కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలతో ముస్లింలు పార్టీకి దూరం అయ్యే అవకాశాలున్నాయని వీహెచ్ అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డినే తాను ప్రశ్నించానని వీహెచ్ గుర్తు చేశారు. ఈ అంశంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని.. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన గురువారం చెప్పారు.

Also Read: ఆయన రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చోవచ్చు.. కేటీఆర్ ధ్వజం
Also Read: పాతబస్తీలో యువకుల గొడవ, పిడి గుద్దులతో హల్‌చల్.. వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.