యాప్నగరం

తెలంగాణలో కరోనా కాస్త తగ్గుముఖం.. 1256కి చేరిన మరణాలు

Coronavirus Telangana: గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 249 కొత్త కేసులు నమోదయ్యాయి.

Samayam Telugu 16 Oct 2020, 9:12 am
తెలంగాణలో గురువారం నాటి కరోనా కేసులకు సంబంధించిన హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు. గురువారం మొత్తం 1554 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,19,224 కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 23,203గా ఉన్నాయి. మరో 19,251 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1435 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక గురువారం మరో ఏడుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1256కి చేరింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
corona test


గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 249 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది.

మరోవైపు, తెలంగాణలో గురువారం ఒక్కరోజే 43,916 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1554 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 37.5 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల్లో మరో 831 మంది ఫలితాలు తేలాల్సి ఉంది. తెలుగులో హెల్త్ బులెటిన్ పూర్తి వివరాలకు కింది పీడీఎఫ్ క్లిక్ చేయండి.

Media Bulletin - Telugu 15102020

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.