యాప్నగరం

TS: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ముగ్గురు మృతి

కరోనాబారి నుంచి నిన్న ఒక్క రోజే 631 మంది కోలుకున్నారు. మరోవైపు మృతుల సంఖ్య 15వందలకు చేరువలో ఉంది.

Samayam Telugu 14 Dec 2020, 9:40 am
తెలంగాణ ప్రజలకు భారీ ఊరట దొరికింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్ల్లో 384 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,78,108 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,496కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 631 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,69,232కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
coronavirus cases in Telangana


Read More: చోరీ చేసి పరుగులు.. తిన్నగా వెళ్లి పోలీసుల ముందే ఆగడంతో

మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 7,380 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 5,298 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 61,64,661కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 101 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 28,980 మందికి కొవిడ్‌-19 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.