యాప్నగరం

తెలంగాణలో 644కి చేరిన కరోనా కేసులు, ఒకే రోజులో 52 మందికి

Telangana Coronavirus Cases: మొత్తం చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటివరకూ 110 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లుగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 516 మంది ఉన్నారు.

Samayam Telugu 14 Apr 2020, 10:11 pm
తెలంగాణలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య మంగళవారం మరింతగా పెరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కొత్తగా 52 మందికి సోకినట్లుగా మంగళవారం ఒక్కరోజే గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 644కి చేరింది. మంగళవారం రాత్రి 52 మందికి కొత్తగా కరోనా సోకినట్లుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక మొత్తం చికిత్స పొందుతున్న వారిలో ఇప్పటివరకూ 110 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లుగా వెల్లడించారు. ఇక ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 516 మంది ఉన్నారు. మంగళవారం ఏడుగురు కోలుకొని డిశ్చార్జి కాగా, ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా రోగుల మరణాల సంఖ్య 18కి చేరింది.
Samayam Telugu corona representative


హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 307 కేసులు (యాక్టివ్, డిశ్చార్జి అయిన వారు కలిపి) నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంది. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలివీ..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.