యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 29కి మొత్తం మృతులు

Telangana Coronavirus Deaths: శనివారం కరోనా ధాటికి ఒకరు చనిపోయారు. ఈ మరణంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29 మంది కరోనా వల్ల చనిపోయినట్లయింది.

Samayam Telugu 2 May 2020, 10:13 pm
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు శనివారం కాస్త పెరిగాయి. శుక్రవారం సింగిల్ డిజిట్‌కే పరిమితమైన కరోనా కేసులు శనివారం 17 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసులు 1061కు చేరుకున్నాయి. అంతేకాక, శనివారం కరోనా ధాటికి ఒకరు చనిపోయారు. ఈ మరణంతో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 29 మంది కరోనా వల్ల చనిపోయినట్లయింది.
Samayam Telugu corona deaths


ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసులు 533 ఉండగా.. 499 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. శనివారం కొత్తగా నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా మరో రెండు 2 రంగారెడ్డి జిల్లాలో గుర్తించారు. శనివారం 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. గత 14 రోజుల వ్యవధిలో మరో 16 జిల్లాల్లో ఒక్క కరోనా కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.