యాప్నగరం

తెలంగాణ ప్రజలకు ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు

గత నాలుగు రోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నాయి. 8 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1249కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు కూడా బాగానే ఉంది.

Samayam Telugu 15 Oct 2020, 9:55 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న రాత్రి 8గంటల నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో తాజాగా 1,432 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,17,670కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనాతో 8మంది మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 1,249కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 19,084 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: హైదరాబాద్‌వాసులకు గుడ్ న్యూస్.. నగరాన్ని దాటేసిన వాయుగుండం

భారత్‌లో కరోనా డెత్ రేట్ 1.5శాతంగా ఉంటే.. తెలంగాణలో అది 0.57 శాతానికి పడిపోయింది.. రివకరీ రేటు దేశవ్యాప్తంగా 87.3 శాతంగా ఉంటే.. అదే రాష్ట్రంలో 88.76 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వం కరోనా బులెటిన్‌లో పేర్కొంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 244, మల్కాజిగిరి 115, మిగితా జిల్లాల్లో వందలోపు కేసులు నమోదు అయ్యాయి. అయితే గత కొన్నిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తుండటంతో ప్రజలకు ఊరట లభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.